ETV Bharat / sports

లాక్​డౌన్​లో బైక్​పై సవారి చేస్తున్న ధోనీ!

author img

By

Published : Apr 21, 2020, 5:26 PM IST

MS Dhoni Enjoy bike ride with his daughter Ziva in Coronavirus lockdown
లాక్​డౌన్​లో బైక్​పై సవారి చేస్తున్న ధోని!

కరోనా లాక్​డౌన్​ కారణంగా క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ. తాను నివసిస్తున్న ఫామ్​హౌస్​లో తన కుమార్తె జీవాతో కలిసి బైక్​పై సవారి చేస్తున్నాడు.

లాక్​డౌన్​ నేపథ్యంలో కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ. రాంచీలోని తన ఫామ్​హౌస్​లో కుమార్తె జీవాతో బైక్​పై సవారి చేస్తున్నాడు. ధోని భార్య సాక్షి వీడియోను చిత్రీకరించగా.. చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు ట్విట్టర్​లో షేర్​ చేసింది.

సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉండే సాక్షి.. ధోనీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవలే ధోనీ ఫామ్​హౌస్​లోని గార్డెన్​లో పని చేస్తున్న ఫొటోను నెట్టింట షేర్ చేసింది.

మహేంద్రసింగ్​ ధోనీ.. ఇంగ్లాండ్​ వేదికగా 2019 ప్రపంచకప్​లో​ న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో చివరిసారిగా​ బ్యాట్​ పట్టాడు. ఆ మ్యాచ్​లో 77 బంతుల్లో 50 పరుగులు చేసి మార్టిన్​ గప్తిల్​ చేతిలో రనౌట్​ అయి వెనుదిరిగాడు. ఈ పోరులో 18 పరుగుల తేడాతో కివీస్​ విజయం సాధించింది. ఆ తర్వాత ఏ అంతర్జాతీయ మ్యాచ్​లోనూ ధోనీ ప్రాతినిధ్యం వహించలేదు. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్​ శిక్షణా శిబిరంలో మహీ పాల్గొన్నాడు. కరోనా లాక్​డౌన్​ కారణంగా ఐపీఎల్​ నిరవధికంగా వాయిదా పడటంతో ఆటగాళ్లు ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇదీ చూడండి.. లాక్​డౌన్​లో సరికొత్త లుక్​తో దర్శనమిచ్చిన కపిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.