శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ.. కరోనా(యూకే స్ట్రెయిన్) బారి నుంచి కోలుకున్నాడు. 13 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న అతడు.. తిరిగి బయోబుబుల్ వాతావరణంలో ఉన్న తమ జట్టులో చేరాడు.
శ్రీలంక-ఇంగ్లాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగుతోంది. జనవరి 14న తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 421 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో లంక నిలకడగా ఆడుతోంది.
ఇదీ చూడండి : ఇంగ్లాండ్ క్రికెటర్కు స్ట్రెయిన్ వైరస్.. మ్యాచ్ యథాతధం