ETV Bharat / sports

ప్రపంచకప్​: ఆరంభం అదుర్స్​.. ఆసీస్​పై భారత్ విజయం

author img

By

Published : Feb 21, 2020, 4:45 PM IST

Updated : Mar 2, 2020, 2:11 AM IST

మహిళా ప్రపంచకప్ ఆరంభ పోరులో భారత్​ బోణీ కొట్టింది. ఈ మెగాటోర్నీలో ఫేవరెట్లు భారత్​, ఆస్టేలియా నువ్వానేనా అన్నట్లు పోరాడాయి. అయితే ఆఖరికి భారత్​ 17 పరుగుల తేడాతో గెలిచింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన పూనమ్ యాదవ్ 'ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్'​గా నిలిచింది.

India Women vs Australia Women
ప్రపంచకప్​: ఆరంభం అదుర్స్​.. ఆసీస్​పై భారత్ విజయం

సిడ్నీ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్​ ఆరంభ మ్యాచ్​లో భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. ​బౌలింగ్​ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. 133 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు 115 పరుగులకు ఆలౌట్ అయింది.

హేలీ అర్ధశతకంతో

లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టును సూపర్​ ఇన్నింగ్స్​తో ముందుకు నడిపించింది అలీసా హేలీ. అయితే మరో ఎండ్​లోని​ బ్యాట్స్​ఉమెన్​ మూనే (6), లానింగ్ ​(5), హైనెస్ ​(6) పేలవంగా ఆడటం వల్ల ఆమెకు మద్దతు కరవైంది. అయినా హేలీ 51 (35 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్​) అర్ధశతకంతో రాణించి ఔటైంది. అయితే కొద్దిసేపు గార్డెనర్​ 34 (36 బంతుల్లో; 3 ఫోర్లు, 1 సిక్సర్​) పోరాడింది. పెర్రీ (0), జోనస్సెన్ (2), అన్నాబెల్ ​(​2) నిరాశపర్చారు.

తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత అమ్మాయిల బౌలింగ్​ విభాగం కీలకంగా నిలిచింది. పూనమ్​ యాదవ్​ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసింది. ఈ అమ్మడుకు తోడుగా శిఖా పాండే 3 వికెట్లు, రాజేశ్వరి ఒక వికెట్​ ఖాతాలో వేసుకుంది. వీరికి తోడు భారత జట్టు కీపర్​ తానియా భాటియా రెండు కీలక స్టంప్​ ఔట్​లు చేసింది.

ఆరంభం దక్కినా

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. షెఫాలి వర్మ 29 (15 బంతుల్లో; 5ఫోర్లు, 1సిక్సర్​) మెరుపు వేగంతో బ్యాటింగ్‌ చేసింది. ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. అయితే మరో ఓపెనర్​ స్మృతి మంధాన 10 (10, 11 బంతుల్లో; 2ఫోర్లు) ఈ మ్యాచ్​లో నిరాశపర్చింది. ఇద్దరూ తొలి వికెట్​కు 41 పరుగులు చేశారు. అయితే కేవలం 6 పరుగుల వ్యవధిలో స్మృతి, షెఫాలీ, హర్మన్​ ఔటయ్యారు. ఫలితంగా 47 రన్స్​కు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్​.

అర్ధశతకం మిస్సైనా

టాప్​ బ్యాటర్లు ఔటైన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మ... జెమిమా రోడ్రిగ్స్‌తో 26 (33 బంతుల్లో) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దూకుడుగా ఆడే క్రమంలో జెమీమా పెవిలియన్‌కు చేరినా వేదా (9*, 11 బంతుల్లో)తో కలిసి దీప్తిశర్మ పోరాడింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచిన దీప్తి 49*(46 బంతుల్లో; 3×4) రాణించింది. అయితే ఆఖర్లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోవడం వల్ల భారత్‌ 132 పరుగులకే పరిమితమైంది. ఆసీస్‌ బౌలర్లలో జోనస్సెన్ రెండు, ఎలిసీ పెర్రీ, డెలిస్సా చెరో వికెట్‌ పడగొట్టారు.

Last Updated : Mar 2, 2020, 2:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.