ETV Bharat / sports

పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్​

author img

By

Published : Apr 24, 2020, 5:20 PM IST

Gambhir performs last rites of domestic help after lockdown prevents body from reaching family
పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్​

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ తన ఇంట్లో పని మనిషికి అంత్యక్రియలు నిర్వహించి మంచి మనసు చాటుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా మృతదేహాన్ని ఆమె సొంతూరు పంపించలేని పరిస్థితిలో ఆయనే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించినట్లు ట్విట్టర్​లో తెలిపారు.

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, తూర్పు దిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ తన ఉదారత చాటుకున్నారు. తన ఇంట్లో సహాయకురాలిగా (పనిమనిషి) పనిచేస్తున్న సరస్వతి పత్రా అంత్యక్రియలను నిర్వహించారు. ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పని చేస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా మధుమేహం, అధిక రక్త పోటుతో తీవ్రంగా బాధపడుతోంది. దీంతో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అయితే లాక్‌డౌన్ కారణంగా మృతదేహాన్ని ఒడిశాలో ఉంటున్న ఆమె కుటుంబానికి పంపలేని పరిస్థితుల్లో గంభీర్ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు.

"నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ పని మనిషి కాదు. ఆమె నా కుటుంబ సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందర్నీ గౌరవించాలనేదే నా సిద్ధాంతం. ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ఇదే మార్గం. అది నా దేశం ఆలోచన. ఓం శాంతి."

-గౌతమ్​ గంభీర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

  • Taking care of my little one can never be domestic help. She was family. Performing her last rites was my duty. Always believed in dignity irrespective of caste, creed, religion or social status. Only way to create a better society. That’s my idea of India! Om Shanti pic.twitter.com/ZRVCO6jJMd

    — Gautam Gambhir (@GautamGambhir) April 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంచి మనసు చాటుకున్న గంభీర్‌ను కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. "అనారోగ్యంతో ఉన్న సరస్వతిని గంభీర్ జాగ్రత్తగా చూసుకున్నారు. ఒడిశాలోని ఆమె కుటుంబానికి మృతదేహాన్ని పంపించలేని పరిస్థితుల్లో ఆమెకు అంత్యక్రియలు స్వయంగా నిర్వహించారు. ఆమెపై ఉన్న గౌరవాన్ని చాటిచెప్పారు. జీవనోపాధి కోసం సొంతూర్లు వదిలిపెట్టిన ఎంతో మంది పేదలకు ఇది మానవత్వంపై విశ్వాసాన్ని పెంచుతుంది" అని ట్వీట్‌ చేశారు. సరస్వతి ఒడిశాలోని జాజ్‌పుర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందినవారని స్థానిక మీడియా తెలిపింది.

ఇదీ చూడండి.. 'నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.