ETV Bharat / sports

బీసీసీఐ సీనియర్​ సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా చేతన్ శర్మ

author img

By

Published : Dec 24, 2020, 9:46 PM IST

Former India pacer Chetan Sharma appointed as BCCI's senior national selection committee new chairman
బీసీసీఐ సీనియర్​ సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా చేతన్ శర్మ

సీనియర్​ సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా మాజీ పేసర్​ చేతన్​ శర్మను నియమించింది బీసీసీఐ. శుక్రవారం అహ్మద్​బాద్​లో జరిగిన బోర్డు వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

భారత క్రికెట్​ నియంత్రణ మండలి జాతీయ సీనియర్​ సెలెక్షన్​​ కమిటీని శుక్రవారం బోర్డు నియమించింది. ఈ సెలెక్షన్​ కమిటీ ఛైర్మన్​గా టీమ్ఇండియా మాజీ పేసర్​ చేతన్​ శర్మను బోర్డు ఎంపిక చేయగా.. అబ్బే కురువిల్లా, డెబాషిస్ మొహంతిలను ఇందులో సభ్యులుగా చేర్చింది.

ఐపీఎల్​లో పది జట్లు

అహ్మదాబాద్​ వేదికగా శుక్రవారం జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో బోర్డు సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో కొత్త జట్లు చేర్చే విషయమై బీసీసీఐ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 2022 నుంచి ఐపీఎల్​లో 10 జట్లు పోటీపడనున్నాయి.

ఒలింపిక్స్​కు క్రికెట్​!

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్​లో టీ20 క్రికెట్​ను చేర్చే విషయమై ఐసీసీ వేసిన బిడ్​కు బీసీసీఐ సపోర్ట్​గా నిలిచింది. లాక్​డౌన్​ ప్రభావంతో జీతాల్లేక ఇబ్బందులు పడ్డ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు(పురుషులు, మహిళలు) పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

ఉపాధ్యక్షుడిగా రాజీవ్​ శుక్లా

బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లాను నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీసీ బోర్డులో డైరెక్టర్​గా గంగూలీ కొనసాగేందుకు పరిపాలన కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: 'కోహ్లీ, రహానె దారులు వేరైనా.. లక్ష్యం ఒక్కటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.