ETV Bharat / sports

ఐపీఎల్ తర్వాత ధోనీకి వీడ్కోలు మ్యాచ్: బీసీసీఐ

author img

By

Published : Aug 19, 2020, 8:59 PM IST

Updated : Aug 19, 2020, 9:25 PM IST

వీడ్కోలు మ్యాచ్​ గురించి ధోనీతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి చెప్పారు. మహీకి చివరి​ మ్యాచ్​ను ఘనంగా​ నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిపారు.

BCCI
ధోనీ

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్​కు ఇటీవలే రిటైర్మెంట్​ ప్రకటించాడు. మహీకి వీడ్కోలు మ్యాచ్​ నిర్వహించాలని బీసీసీఐని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి బోర్డు అధికారి ఒకరు మాట్లాడారు.

ఐపీఎల్​ జరుగుతున్నప్పుడు లేదంటే ఆ తర్వాత వీడ్కోలు మ్యాచ్​ గురించి ధోనీతో చర్చిస్తామని ఆ అధికారి అన్నారు. అతడి ఏం చెబుతాడో దాని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

"ప్రస్తుతం అంతర్జాతీయ సిరీస్​లు లేవు. ఈ విషయమై ఐపీఎల్​ పూర్తయిన తర్వాత మహీతో చర్చిస్తాం. అనంతరం నిర్ణయం తీసుకుంటాం. ధోనీ దేశానికి ఎంతో చేశాడు. మేం కూడా అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని అనుకుంటున్నాం"

-బీసీసీఐ అధికారి

ధోనీ చివరి అంతర్జాతీయ​ మ్యాచ్​ను అతడి స్వస్థలం రాంచీలోనే నిర్వహించాలని బీసీసీఐకి ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సొరెన్​ ఇటీవల విజ్ఞప్తి చేశారు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఐపీఎల్​ 13 జరగనుంది. సీఎస్కే సారథిగా బరిలోకి దిగనున్నాడు ధోనీ. గతేడాది ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో సెమీస్​లో ఆడిన తర్వాత మళ్లీ ఈ మెగాలీగ్​తోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

ఇది చూడండి సచిన్​ X కోహ్లీ : పన్నెండేళ్ల కెరీర్​లో ఎవరిది పైచేయి?

Last Updated : Aug 19, 2020, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.