ETV Bharat / sports

IND VS AUS: రెండో రోజు ఆట పూర్తి.. అధిక్యంలో ఆసీస్​!

author img

By

Published : Feb 18, 2023, 5:13 PM IST

Updated : Feb 18, 2023, 5:56 PM IST

border gavaskar trophy 2023
border gavaskar trophy 2023

దిల్లీ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. మ్యాచ్ వివరాలు..

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా టీమ్​ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. టీమ్ఇండియా కన్నా 62 పరుగుల అధిక్యంలో నిలిచింది. ట్రావిస్​ 39, లబుషేన్​ 16 క్రీజులో ఉన్నారు. జడేజా ఒక వికెట్​ పడగొట్టాడు.

కాగా, రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(6) ఆరో ఓవర్‌లోనే స్పిన్నర్ రవీంద్ర జడేజాకు వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్వీప్, రివర్స్ స్వీప్‌ షాట్స్​తో 81 పరుగులు చేసిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. అయితే అది బోల్తా కొట్టింది. స్వీప్ ఆడిన ఖవాజా ఫీల్డర్ శ్రేయస్ అయ్యర్ చేతికి దొరికి వెనుదిరిగాడు. ఇకపోతే ట్రావిస్ హెడ్.. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతున్నాడు. మరి అతడిని ఆదివారం తొలి సెషన్‌లో భారత బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి.

ఇకపోతే ఈ రోజు భారత్ జట్టులో అక్షర్ పటేల్ ప్రదర్శన హైలైట్​గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 139/7తో కష్టాల్లో పడింది. అయితే అప్పుడు అతడు వీరోచితంగా ఆడి జట్టుకు అండగా నిలిచాడు. 115 బంతులాడిన అతడు తొమ్మది ఫోర్లు, మూడు ఆర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. అశ్విన్(37)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఇదీ చూడండి: 'అంపైర్​ను అరెస్టు చేయండి'.. కోహ్లీ LBWపై నెటిజన్ల ఆగ్రహం!

Last Updated :Feb 18, 2023, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.