ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ్లో ఆడనున్న పదకొండు మంది పేర్లను వెల్లడించింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు ఇద్దరికీ చోటిచ్చింది.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రానున్నారు.
పూర్తి టీమ్ ఇదే..
- విరాట్ కోహ్లీ(కెప్టెన్)
- రహానె(వైస్ కెప్టెన్)
- రోహిత్ శర్మ
- గిల్
- పుజారా
- పంత్(కీపర్)
- అశ్విన్
- జడేజా
- బుమ్రా
- ఇషాంత్
- షమీ