ETV Bharat / sports

'టెస్టు క్రికెట్ ICUలో ఉంది- వారికి WTC కంటే డొమెస్టిక్ లీగ్​ ఎక్కువైంది!'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 3:27 PM IST

Updated : Jan 3, 2024, 3:55 PM IST

Aakash Chopra Comments On Test Cricket
Aakash Chopra Comments On Test Cricket

Aakash Chopra Comments On Test Cricket: టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా టెస్టు క్రికెట్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు. సంప్రదాయ క్రికెట్ ప్రస్తుతం ప్రమాదంలో ఉందని అన్నాడు.

Aakash Chopra Comments On Test Cricket: టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా టెస్టు క్రికెట్ ప్రస్తుతం ఐసీయూ (ICU)లో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఫార్మాట్​ను వెంటిలేటర్​పై ఉంచాలని అన్నాడు. సౌతాఫ్రికా టెస్టు క్రికెట్​ను అవమానించేలా ప్రవర్తించిందని విమర్శలు వస్తున్న నేపథ్యలో ఆకాశ్ ఇలా స్పందించాడు. అయితే ఫిబ్రవరిలో సౌతాఫ్రికా రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లను సౌతాఫ్రికా టెస్టు జట్టులో ప్రకటించడం ఈ విమర్శలకు కారణమైంది.

అయితే సౌతాఫ్రికా ప్రకటించిన 14 మంది బృందంలో సగం మంది అన్​క్యాప్డ్​ ప్లేయర్లే. మిగిలిన ఏడుగురిలో డేవిడ్ బెడింగమ్, కీగన్ పీటర్​సన్ ఇద్దరూ రీసెంట్​గా బాక్సింగ్ డే మ్యాచ్​లోనే టెస్టు అరంగేట్రం చేశారు. ఈ లెక్కన జట్టులో ఐదుగురు మాత్రమే సీనియర్ ప్లేయర్లు ఉండడం వల్ల ఆకాశ్ సహా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ స్టీవ్​ వా సౌతాఫ్రికా బోర్డుపై మండిపడ్డారు. కేవలం సౌతాఫ్రికా టీ20 లీగ్​ కోసమే ఇలా బోర్డు ఇలా చేసిందని, వారికి టెస్టు క్రికెట్​ కంటే డొమెస్టిక్ లీగ్​లు ఎక్కువైపోయాయని అన్నారు.

'టెస్టు క్రికెట్ ఐసీయూలో ఉంది. తక్షణమే ఈ ఫార్మాట్​ను వెంటిలేటర్​పై ఉంచాలి. న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ కోసం సౌతాఫ్రికా బీ గ్రేడ్ జట్టును అనౌన్స్ చేసింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్​లో భాగంగా జరగనున్న రెండు టెస్టు మ్యాచ్​ల కంటే వారికి డొమెస్టిక్ లీగ్ ఎక్కువైపోయింది. అలా అయితే మర్​క్రమ్ నుంచి రబాడా వరకు స్టార్ ప్లేయర్లందరినీ ఎస్​పీఎల్​ (SPL)కు ప్రిపేర్ చేసుకోండి. కుర్రాళ్లు టెస్టు క్రికెట్ ఆడతారు' అని ఆకాశ్ అన్నాడు.

మరోవైపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ బోర్డు తమ జట్టు స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీకి రెస్ట్ ఇచ్చింది. త్వరలో ప్రారంభమయ్యే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్​ (PSL), 2024 టీ20 వరల్డ్​కప్ కోసమే బోర్డు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

సౌతాఫ్రికా స్పందన: టెస్టు క్రికెట్​పై తమకెంతో గౌరవం ఉందని సౌతాఫ్రితా బోర్డు స్పష్టం చేసింది. 'కివీస్​తో టెస్టు సిరీస్ కన్ఫార్మ్ కాకముందే సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ నిర్వాహకులతో ఒప్పందం కుదిరింది. అందుకే వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. ఈ​ సిరీస్ మినహా, డబ్ల్యూటీసీ మిగతా మ్యాచ్​లకు ఇలా జరగకుండా చూసుకుంటాం' అని బోర్డు తెలిపింది.

సమమా? సమర్పణమా?- సఫారీలతో రెండో టెస్ట్​కు భారత్ రెడీ- తుది జట్ల వివరాలివే!

వార్నర్ బ్యాగ్ చోరీ- తిరిగివ్వాలని రిక్వెస్ట్- అందులో ఏముందంటే?

Last Updated :Jan 3, 2024, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.