ETV Bharat / sports

Tokyo Olympics: మెగా క్రీడలకు సిద్ధంగా ఉండండి

author img

By

Published : May 27, 2021, 7:34 AM IST

టోక్యో ఒలింపిక్స్​ జరుగుతాయని, భారత్​ సన్నద్ధంగా ఉండాలని అన్నారు భారత ఒలింపిక్​ సంఘం(ఐఓఏ) అధ్యక్షుడు నరిందర్​ బత్రా. ఈ మెగాక్రీడలకు వెళ్లే భారత బృందం మొత్తానికి కొవిడ్‌-19 టీకాలు వేస్తామని తెలిపారు.

olympics
ఒలింపిక్స్‌

టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం వల్ల క్రీడలను రద్దు చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ సంఘం (ఐఓసీ) ప్రస్తుతానికైతే క్రీడలను నిర్వహించాలనే పట్టుదలతోనే ఉంది. అయినా సందిగ్ధత మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ జరుగుతాయని, భారత్‌ సన్నద్ధంగా ఉంటే మంచిదని అన్నారు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరిందర్‌ బత్రా.

"ఐఓసీ నుంచి మాకు వస్తున్న సమాచారం ప్రకారం ఒలింపిక్స్‌ షెడ్యూలు ప్రకారమే జరుగుతాయి. చాలా స్పష్టంగా ఈ విషయం చెబుతున్నారు. కాబట్టి మనం సిద్ధంగా ఉంటే మంచిది" అని చెప్పారు. ఒలింపిక్స్‌కు వెళ్లే భారత బృందం మొత్తానికి కొవిడ్‌-19 టీకాలు వేస్తామని తెలిపారు. భారత అథ్లెట్లు బాగా సన్నద్ధమవుతున్నారని చెప్పారు. "భారత అథ్లెట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఏ అథ్లెట్‌కూ ఇబ్బంది లేదు. అందరూ తాము కోరుకున్న చోట సాధన చేస్తున్నారు" అని అన్నారు.

ఇదీ చూడండి టోక్యోకు టీకా.. ఒలింపిక్స్‌ నిర్వహణే లక్ష్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.