ETV Bharat / sports

Indonesia Masters 2021: సింధు, లక్ష్యసేన్‌ ముందంజ

author img

By

Published : Nov 17, 2021, 6:36 AM IST

sindhu
సింధు

ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్​లో(Indonesia Masters 2021) భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన శుభారంభం చేశారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంటకు షాక్‌ తగిలింది.

ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో(Indonesia Masters 2021) భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు శుభారంభం చేసింది. మంగళవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ మూడో సీడ్‌ 21-15, 21-19తో సుపానిదా (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-5తో తిరుగులేని ఆధిక్యం సాధించిన సింధు(PV Sindhu News) అదే జోరుతో గేమ్‌ గెలిచి ముందంజలో నిలిచింది. రెండో గేమ్‌లో పుంజుకున్న సుపానిదా.. సింధుకు గట్టిపోటీ ఇచ్చింది. విరామ సమయానికి సింధు 11-8తో ఆధిక్యం సాధించినా.. సుపానిదా 18-19తో సింధు సమీపానికి వచ్చేసింది. కానీ వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు మ్యాచ్‌ ముగించింది.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ప్రపంచ 19వ ర్యాంకర్‌ లక్ష్యసేన్‌ 21-17, 18-21, 21-17తో ప్రపంచ పదో ర్యాంకర్‌ కాంటా సునేయమా (జపాన్‌)కు షాకిచ్చాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంటకు షాక్‌ తగిలింది. తొలి రౌండ్లో ఈ జంట 17-21, 15-21తో యెసిన్‌-తియో యీ (మలేసియా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప 9-21, 21-11, 21-18తో అలెగ్జాండ్రా-పౌల్‌సెన్‌ (డెన్మార్క్‌)పై గెలిచి ముందంజ వేశారు.

ఇదీ చదవండి:

IPL 2021 news: 'వార్నర్​ను తప్పించడానికి కారణం అది​ కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.