ETV Bharat / sports

ఐఓఏ ప్రతినిధులుగా గోపీచంద్, జగన్మోహన్

author img

By

Published : May 9, 2021, 6:43 AM IST

pullela gopichand, badminton coach
పుల్లెల గోపీచంద్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్

కొవిడ్ నేపథ్యంలో మాజీ అథ్లెట్లు, కోచ్​లకు అండగా నిలిచేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ఐఓఏ, సాయ్​ ముందుకొచ్చాయి. ఈ సాయాన్ని వారికి చేర్చేందుకు వీలుగా రాష్ట్రాల వారీగా ఐఓఏ ప్రతినిధులను ఎంపిక చేసింది. వారిలో తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్​ కోచ్​ గోపీచంద్​, జగన్మోహన్​ రావు ఉన్నారు.

కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు, కోచ్​లకు సాయంగా నిలవడం కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్​ సంఘం(ఐఓఏ), భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్​) చేతులు కలిపాయి. అవసరాల్లో ఉన్న వాళ్లకు ఆర్థికంగా, వైద్యపరంగా అండగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. అయితే ఈ సాయం కోసం అంతర్జాల వేదికగా అథ్లెట్లు, కోచ్​లు తమ అవసరాలను విన్నవించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: సీఎస్కే దాతృత్వం.. 450 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు వితరణ

ఈ సాయాన్ని వాళ్లకు చేర్చేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాల వారీగా ఐఓఏ.. ప్రతినిధులను ఎంపిక చేసింది. అందులో తెలంగాణ నుంచి జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్​, భారత హ్యాండ్​బాల్​ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు, జగదీశ్వర్​ రావు, మహేశ్ ఉండగా.. ఆంధ్రప్రదేశ్​ నుంచి రాఘవేంద్ర, సుభాన్​ బాష ఎంపికయ్యారు. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ అథ్లెట్లు, కోచ్​లు www.research.net/r/sai-ioa-covid-19 లింక్ ఓపెన్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని జగన్మోహన్ రావు తెలిపారు.

ఇదీ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్​కు గంగూలీ.. భారత క్రికెటర్లకు వ్యాక్సిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.