ETV Bharat / sitara

చిరు, బాలయ్యకు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ట్రిబ్యూట్

author img

By

Published : Aug 1, 2021, 10:26 PM IST

Sridevi Drama Company Latest Promo
శ్రీదేవి డ్రామా కంపెనీ

లాక్​డౌన్​తో పాటు ఇతర సమయాల్లో తెలుగు హీరోల సేవల్ని గుర్తుచేస్తూ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ప్రత్యేక ప్రదర్శన చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం అలరిస్తోంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతోపాటు ఇతర హీరోల చేస్తున్న సేవలకు గుర్తుగా.. గెటప్​ శీను డ్యాన్స్​ ప్రదర్శన చేశారు. సాయానికి ప్రచారం లేకపోయినా, కనీసం సమాచారం ఇస్తే వేరేవాళ్లకు స్పూర్తిగా నిలుస్తుందని శీను చెప్పారు.

Sridevi Drama Company Latest Promo
తెలుగు హీరోలు

ఇదే కాకుండా ట్రైన్​ జర్నీలో క్లాస్​, మాస్ ప్రజల మధ్య తేడాలను చాలా హాస్యభరితంగా చూపించే ప్రయత్నం చేశారు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్​.. బెగ్గర్​ గెటప్స్​లో చేసిన స్కిట్​లోని సన్నివేశాలు నవ్విస్తున్నాయి.

చివర్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన 'జబర్దస్త్' జడ్జి మను.. తనదైన ఆటో పంచ్​లతో నవ్వించారు. పంచ్​ ప్రసాద్​కే రిట్నర్​ పంచ్​లు వేసి, ఆశ్చర్యపరిచారు. దీని పూర్తి ఎపిసోడ్ వచ్చే ఆదివారం(ఆగస్టు 8) మధ్యాహ్నం ప్రసారమవుతుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.