ETV Bharat / sitara

Jabardasth Promo: వెంకీ కన్నీటికి కారణమేంటి?

author img

By

Published : Aug 8, 2021, 5:48 PM IST

వచ్చే వారం ప్రసారంకానున్న 'జబర్దస్త్'​ ప్రోమో అలరిస్తోంది. కంటెస్టంట్​లు వేసిన పంచులు నవ్వులు పూయించాయి. అయితే స్కిట్​ అనంతరం వెంకీ కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతకీ అతని కన్నీటికి కారణమేమిటంటే?

jabardast
జబర్దస్త్​

హైపర్‌ ఆది, అభి, వెంకీ-తాగుబోతు రమేశ్‌, చలాకీ చంటి టీమ్‌ లీడర్లుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో 'జబర్దస్త్‌'. అనసూయ వ్యాఖ్యాతగా రోజా, మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది.

వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. హైపర్‌ ఆది స్కిట్‌ కోసం అభి, బుల్లెట్‌ భాస్కర్‌, నరేశ్‌ స్టేజ్‌పై మెరిశారు. భాస్కర్‌ను చూపించిన నరేశ్‌.. 'ఇతనే మా గురువుగారు' అని చెప్పగానే.. అభి వేసిన ప్రశ్నకు.. 'ఎందుకులే అన్నా.. నేను గురువుగారు అంటాను. నువ్వు వెంటనే గురువుగారు గురువుగారు అంటూ గుండెలపై తన్నావు అంటావు' అంటూ ఆది వేసిన పంచులతో అందరూ నవ్వులు పూయించారు. వరుస పంచులు, స్కిట్‌లతో కడుపుబ్బా నవ్వుకున్న న్యాయనిర్ణేతలు.. స్కిట్ అనంతరం వెంకీ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఆశ్చర్యపోయారు.

ఏమైందని మనో ప్రశ్నించగా.. 'చేసేది నేను.. చేయించింది నేను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వెంకీ ఎందుకు అంతలా బాధపడ్డారు? అసలు ఏం జరిగింది? అనేది తెలియాలంటే వచ్చే గురువారం వరకూ వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఒక్క టికెట్​పై ఆరు బ్లాక్​బస్టర్ సినిమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.