ETV Bharat / sitara

'మీరంతా ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నారు'

author img

By

Published : Jul 22, 2020, 2:38 PM IST

Y'all have been by my side: Priyanka Chopra to fans as she celebrates 20 yrs in industry
ప్రియాంక

బాలీవుడ్​లో తనదైన నటనతో భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న నటి ప్రియాంకా చోప్రా.. సినీ కెరీర్​లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మైలురాయికి గుర్తుగా చిన్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వేడుకలో తనతో కలిసి పాల్గొనాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చిందీ ముద్దుగుమ్మ

బాలీవుడ్​లో విభిన్న పాత్రలను పోషించి.. తన నటన, అభినయంతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్​ ప్రియాంకా చోప్రా. ఎరోనాటికల్​ ఇంజనీరింగ్​ చదవాలని కలలు కన్న ఈ ముద్దుగుమ్మ.. ముఖానికి రంగేసుకొని చిత్రపరిశ్రమలోకి వచ్చింది. అంతేకాదు సినీ కెరీర్​లో 20 వసంతాలనూ పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ అరుదైన మైలురాయికి గుర్తుగా తన ప్రణాళికలను వెల్లడించింది ప్రియాంక. ఈ 20 ఏళ్ల తన ప్రయాణంలో భాగంగా 20 మధుర స్మృతులను సామాజిక మాధ్యమాల్లో పంచుకోనున్నట్లు తెలిపింది. వర్చువల్​ వేడుకలో తనతో కలిసి పాల్గొనాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చింది.

"2020 నాటికి వినోద పరిశ్రమలో నేను 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ఇది నిజంగా వేడుక సమయం. ఈ ప్రయాణంలో మీరందరూ నాకు తోడుగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే మైలురాయికి గుర్తుగా చిన్న కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నా. ఈ 20 ఏళ్లనాటి నా మధుర స్మృతులను మీతో పంచుకుంటా.. మీరు కూడా ఈ వేడుకలో నాతో కలిసి పాల్గొనండి"

-- ప్రియాంకా చోప్రా, సినీ నటి.

2000 సంవత్సరంలో 'మిస్​ వరల్డ్​'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాల్లో నటించింది. హాలీవుడ్​లోనూ అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ కూడా తనదైన టాలెంట్​తో రాణించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.