ETV Bharat / sitara

యంగ్​ డైరెక్టర్​తో వెంకీ.. లక్ష్యం-2తో గోపీచంద్​.. దానయ్య కుమారుడి తెరంగేట్రం

author img

By

Published : Mar 20, 2022, 7:39 AM IST

Venkatesh New Movie
Venkatesh New Movie

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. ఇందులో వెంకటేష్‌​, గోపీచంద్​ సినిమా విశేషాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తనయుడు కల్యాణ్‌.. కథానాయకుడిగా తెరంగేట్రం చేయనున్నారు.

Venkatesh New Movie: కథానాయకుడు వెంకటేష్‌ మరో కొత్త కథకు పచ్చజెండా ఊపారా? ఓ యువ దర్శకుడితో కలిసి పని చేయనున్నారా? అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. వెంకటేష్‌ ప్రస్తుతం 'ఎఫ్‌3' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రానాతో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్‌సిరీస్‌ చేస్తున్నారు. ఇప్పుడాయన 'జాతిరత్నాలు' ఫేం అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని సమాచారం. వినోదాత్మక కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో దీన్ని నిర్మించనున్నారని ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. అనుదీప్‌ ప్రస్తుతం శివ కార్తికేయన్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ ద్విభాషా చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంకటేష్‌ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

Venkatesh
వెంకటేష్‌

లక్ష్యం2తో వస్తున్న గోపీచంద్

Gopichand
గోపీచంద్‌

Gopichand New Movie:గోపీచంద్‌ కథా నాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. 'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డింపుల్‌ హయాతి కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం మిళితమైన బలమైన కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమా కోసం 'లక్ష్యం2' అనే టైటిల్‌ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్‌ నటిస్తున్న 30వ చిత్రమిది. ఈనెల 21నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జే మేయర్‌, ఛాయాగ్రహణం: వెట్రి పళని స్వామి.

కథానాయకుడిగా నిర్మాత దానయ్య కుమారుడు

DVV Daanaiah  son
దానయ్య కుమారుడితో ప్రశాంత్ వర్మ

dvv danaiah son as hero: ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తనయుడు కల్యాణ్‌ కథా నాయకుడిగా తెరంగేట్రం చేయనున్నారు. ఆయన పరిచయ చిత్రాన్ని యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించనున్నారు. విభిన్నమైన కథలతో సినిమాలు తీసే దర్శకుడిగా ప్రశాంత్‌ వర్మకి పేరుంది. ప్రస్తుతం ఆయన సూపర్‌ హీరో చిత్రం 'హను మాన్‌' తెరకెక్కిస్తున్నారు. అది పూర్తయ్యాక ఆయన చేయనున్న సినిమా కల్యాణ్‌ కథానాయకుడిగానే రూపొందనుంది. అందుకోసం మరో కొత్త రకమైన కథతో స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నారు ప్రశాంత్‌ వర్మ.

ఇదీ చదవండి: 'బీస్ట్'​ సెకండ్​ సింగిల్​.. 'భీమ్లానాయక్​' హాట్​స్టార్​ ట్రైలర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.