ETV Bharat / sitara

వరుషా వెడ్డింగ్: అలీబాగ్​ చేరిన కుటుంబసభ్యులు

author img

By

Published : Jan 23, 2021, 11:21 AM IST

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్​ల వివాహానికి అంతా సిద్ధమైంది. ముంబయిలోని అలీబాగ్​లో ఆదివారం (జనవరి 24) రోజు వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఇప్పటికే ఇరుకుటుంబాల వారు అక్కడికి చేరుకున్నారు.

VaruSha wedding
వరుషా వెడ్డింగ్

బాలీవుడ్ హీరో వరుణ్​ ధావన్​, ఫ్యాషన్​ డిజైనర్​ నటాషా దలాల్​ వివాహానికి అంతా సిద్ధమైంది. జనవరి 24(ఆదివారం)న ముంబయిలోని అలీబాగ్​ రిసార్ట్స్​లో వీరిద్దరి పెళ్లి జరగనుంది. సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఇందుకోసం ఇప్పటికే ఇరుకుటుంబాల వారు, బంధుమిత్రులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

అలీబాగ్ చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు

పెళ్లి జరిగిన తర్వాత ముంబయిలో సినీప్రముఖుల కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, అనుష్క శర్మ వివాహానికి పనిచేసిన వెడ్డింగ్​ ప్లానర్​.. వరుణ్​, నటాషాల పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.