ETV Bharat / sitara

చిరుతో సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసక్తి?

author img

By

Published : Aug 24, 2020, 3:10 PM IST

'ఆచార్య' పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో నటించనున్నారు చిరంజీవి. ఈ సినిమాను నిర్మించేందుకు టాలీవుడ్​ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తి చూపుతోందని సమాచారం.

Chiranjeevi
చిరంజీవి

మెగాస్టార్​ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత చేస్తున్న ప్రాజెక్టుల గురించి ఇటీవలే వెల్లడించారు. వాటిలో లూసిఫర్ రీమేక్​తోపాటు యువ దర్శకుడు బాబీతోనూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తి కనబరుస్తుందని తెలుస్తోంది.

కానీ ముందస్తు ఒప్పందం ప్రకారం చిరు, మరో అగ్ర నిర్మాతతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారట. వీటిల్లో వాస్తవాలు తెలియాలంటే కొద్దిరోజులు ఎదురు చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఆచార్య'లో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మణిశర్మ సంగీత దర్శకుడు. మెగాపవర్ స్టార్ రామ్​ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.