ETV Bharat / sitara

'బ్రహ్మాస్త్ర' కోసం ముంబయి వెళ్లిన నాగ్​

author img

By

Published : Nov 5, 2020, 7:54 AM IST

వరుస సినిమా చిత్రీకరణలతో స్పీడ్​ పెంచారు కింగ్​ నాగార్జున. తాజాగా 'బ్రహ్మాస్త్ర' షూటింగ్​లోనూ ఆయన పాల్గొన్నారు. ముంబయిలో ఈ సినిమా సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి.

tollywood actor nagarjuna brahmastra movie shooting is going in mumbai
'బ్రహ్మాస్త్ర' కోసం ముంబయి వెళ్లిన నాగ్​

కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత తెలుగు నటుల్లో జోరుగా ముందుకు సాగుతున్నారు కింగ్‌ నాగార్జున. అగ్రనటుల్లో అందరికంటే ముందు కెమెరా ముందుకొచ్చిందీ ఆయనే. ఇటీవలే హిమాలయాల్లో 'వైల్డ్‌డాగ్‌' షూటింగ్‌ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ముంబయిలో జరుగుతున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రీకరణలో భాగస్వాములయ్యారు.

ఈ షెడ్యూల్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, మౌనీరాయ్‌తో కలిసి ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను వీరి మీద చిత్రీకరిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

ఇదీ చూడండి:'ఉప్పెన' సర్​ప్రైజ్​ ఇవ్వనున్న మహేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.