ETV Bharat / sitara

'మగధీర' 100 మందిని చంపే సీన్- 15 ఏళ్ల క్రితమే..

author img

By

Published : Jul 29, 2021, 5:31 PM IST

Updated : Jul 29, 2021, 7:53 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి 'మగధీర' సినిమాలో 100 మందిని చంపే సీన్​ వెనక పెద్ద కథే ఉంది? ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళీనే ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ ఏంటా విషయం?

SS Rajamouli about Magadheera movie 100 soldier fight scene
రాజమౌళి మగధీర మూవీ

ఎస్.ఎస్.రాజమౌళి.. ఈ పేరు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే 'బాహుబలి'కి ముందు మనకు మాత్రమే తెలిసిన ఈయన.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల సత్తా చాటడమే కాకుండా స్టార్​ హీరోలతో సమానంగా ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఇప్పటివరకు రాజమౌళి 11 సినిమాలు తీస్తే, అందులో కనీసం ఒక్కటంటే ఒక్కడి కూడా ప్లాఫ్​​ కాలేదు. దీన్ని బట్టే ఆయన స్టామినా ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే సినిమాలతో రాజమౌళి హిట్లు, బ్లాక్​బస్టర్లు కొట్టే విషయంలో కథారచయిత, తన తండ్రి విజయేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకం. ఆయన అద్భుతంగా స్టోరీ రాస్తే, దానిని అంతకంటే అద్భుతంగా తెరకెక్కించి, ప్రేక్షకులను ఊహాలోకంలో విహరించేలా చేసేవారు రాజమౌళి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వీరి కాంబినేషన్​లో వచ్చిన రామ్​చరణ్​- 'మగధీర' అయితే అప్పట్లో టాలీవుడ్​ రికార్డులను తిరగరాసింది. అందులో 100 మందిని చంపే సీన్​ ఇప్పుడు చూసినా సరే రొమాలు నిక్కబొడుచుకోవడం(గూస్​బంప్స్) ఖాయం. గతంలో ఈటీవీ యువభారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజమౌళి ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

'మగధీర'లో కాలభైరవ(రామ్​చరణ్​), 100 మందిని చంపే సీన్ అల్టిమేట్​. అప్పటివరకు వచ్చిన సినిమాల్లోకెల్లా ది బెస్ట్​గా నిలిచింది. అయితే అంతకు 15 ఏళ్ల క్రితమే తన తండ్రి, ఈ సీన్​ను రాశారని రాజమౌళి 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దానిని పట్టుకొని ఓ డైరెక్టర్​ దగ్గరకు వెళ్తే ఇలాంటివి ఎవరు చూస్తారంటూ మాట్లాడారని అన్నారు. తానే దర్శకుడుగా మారిన కొన్నాళ్లకు ఆ కథను 'మగధీర'గా తెరకెక్కించినట్లు చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

400 ఏళ్ల క్రితం చనిపోయిన కాలభైరవ- మిత్రవింద.. మళ్లీ పుట్టి ఎలా ఒక్కటయ్యారు అనే కథతో 'మగధీర' తీశారు. మెగాహీరో రామ్​చరణ్, కాజల్​ హీరోహీరోయిన్లుగా చేశారు. కీరవాణి అందించిన సంగీతం, పాటలు.. ఇప్పటికే ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి! ఈ సినిమా విడుదలై శుక్రవారానికి(జులై 30) 12 ఏళ్లు.

Last Updated : Jul 29, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.