ETV Bharat / sitara

వ్యాక్సిన్​ తీసుకున్న బాలీవుడ్ తొలి సెలబ్రిటీ

author img

By

Published : Jan 9, 2021, 4:43 PM IST

Updated : Jan 9, 2021, 6:05 PM IST

కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకున్న తొలి భారతీయ సెలబ్రిటీగా నటి శిల్ప శిరోద్కర్ నిలిచింది. ఈమెకు మహేశ్​బాబు భార్య నమ్రతకు స్వయానా సోదరి కావడం విశేషం.

Shilpa Shirodkar becomes first Indian actor to get COVID-19 vaccine
వ్యాక్సిన్​ తీసుకున్న బాలీవుడ్ తొలి సెలబ్రిటీ

బాలీవుడ్​ నటి శిల్ప శిరోద్కర్.. దుబాయ్​లో కరోనా వ్యాక్సిన్​ వేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్​స్టా వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్​ తీసుకున్న తొలి భారతీయ సెలబ్రిటీగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె సోదరి, మహేశ్​బాబు సతీమణి నమ్రత.. గుడ్​ గర్ల్ అంటూ కామెంట్ చేసింది.

1992 సమయంలో కొన్ని హిందీ సినిమాలు చేసిన శిల్ప.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల నటనకు విరామమిచ్చింది. ప్రస్తుతం భర్తతో కలిసి దుబాయ్​లో నివాసముంటోంది. మహేశ్ బాబు​ కుటుంబంతో సహా గతంలో దుబాయ్​ వెళ్లినప్పుడు వీళ్ల ఇంట్లోనే ఉన్నారు.

ఇది చదవండి: కరోనా ఎఫెక్ట్​: బాలీవుడ్​కు రూ.వేల కోట్లు నష్టం!

Last Updated :Jan 9, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.