కన్నడ నటుడు, నిర్మాత డీఎస్ మంజునాథ్.. కరోనా ప్రభావంతో ఆదివారం మరణించారు. ఈయన నిర్మించిన రెండు చిత్రాలు ఇప్పటికే విడుదలవగా, మరో సినిమా ఈ ఏడాది జూన్లో విడుదల కావాల్సి ఉంది.
శ్వాస తీసుకోవడంలో గత కొన్నిరోజుల నుంచి మంజునాథ్ ఇబ్బంది పడుతున్నారని సహనిర్మాత కృష్ణమూర్తి చెప్పారు. పరిస్థితి విషమించడం వల్ల వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. గతంలో కొవిడ్ లక్షణాలు కనిపించినా సరే అతడు వైరస్ను నిర్లక్ష్యం చేశారని తెలిపారు.