ETV Bharat / sitara

కోటి రూపాయలు గెల్చుకున్న 'బాబా జాక్సన్'

author img

By

Published : Jun 11, 2020, 11:41 AM IST

మైకేల్​ జాక్సన్​ స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న బాబా జాక్సన్.. ఓ వర్చువల్ రియాలిటీ షోలో విజేతగా నిలిచి కోటి రూపాయలు దక్కించుకున్నాడు. ఈ విషయమై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు.
Baba Jackson
డ్యాన్సర్ బాబా జాక్సన్

పాప్​స్టార్ మైకేల్ జాక్సన్​ స్టెప్పులతో అదరగొట్టి, రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్​గా మారిన బాబా జాక్సన్ మీకు గుర్తున్నాడా? లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఎందుకంటే అతడు ఇటీవలే ఓ రియాలిటీ షోలో పాల్గొని, ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్​ హీరో వరుణ్ ధావన్ ట్విట్టర్​ వేదికగా వెల్లడించడం విశేషం.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్​కార్ట్, లాక్​డౌన్ వేళ 'ఎంటర్​టైనర్​ నంబర్.1' పేరుతో ఓ వర్చువల్ రియాలిటీ షోను నిర్వహించింది. కథానాయకుడు వరుణ్ ధావన్ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మొత్తంగా ఎనిమిది వారాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో చివరివరకు నిలిచిన యువరాజ్ సింగ్ అలియాస్ బాబా జాక్సన్.. కోటి రూపాయలు సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే బాబా జాక్సన్​ వీడియోలను చూసిన హృతిక్ రోషన్, టైగర్​ష్రాఫ్, వరుణ్ ధావన్​ తదితరులు అతడి డ్యాన్స్​ను మెచ్చుకున్నారు. ఇతడి తండ్రి జోధ్​పుర్​లో టైల్స్ అమర్చే పనిలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు జాక్సన్.. భారీ మొత్తం గెలుచుకోవడం వల్ల ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.