లాక్​డౌన్ వల్ల దొరికిన 'శాకుంతలం' దుష్యంతుడు

author img

By

Published : Mar 15, 2021, 4:51 PM IST

SHAKUNTALAM DUSHYANTHDU

'శాకుంతలం'లో దుష్యంతుడు పాత్ర కోసం దేవ్ మోహన్​ ఒప్పుకోవడం గురించి నిర్మాత నీలిమ గుణ చెప్పారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సోమవారం లాంఛనంగా మొదలైంది. షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు.

శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ మాటల్లో

తన తండ్రి తీస్తున్న 'శాకుంతలం' సినిమాలో దుష్యంతుడి పాత్రకు దేవ్ మోహన్ ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నామని నిర్మాత, గుణశేఖర్ పెద్ద కుమార్తె నీలిమ గుణ ఆనందం వ్యక్తం చేశారు. సమంతకు సరిపోయే సరైన కథానాయకుడ్ని అన్వేషిస్తున్న క్రమంలో లాక్​డౌన్​లో అనుకోకుండా దేవ్ నటించిన 'సూఫియం సుజాతీయం' సినిమా చూశానని, దేవ్ దుష్యంతుడి పాత్రకు సరిగ్గా సరిపోతాడని అప్పుడే అనిపించిదని ఆమె అన్నారు. వెంటనే ఇన్​స్టాలో మెసేజ్ పెడితే, రిప్లై ఇవ్వడాన్ని నమ్మలేకపోయామని నీలిమ తెలిపారు.

ఆ తర్వాత హైదరాబాద్​ వచ్చిన దేవ్​కు కథ చెప్పి మూడు నెలలపాటు గుర్రపు స్వారీ, పోరాటాలు నేర్పించినట్లు నీలిమ ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. మరో వారంలో 'శాకుంతలం' షూటింగ్ మొదలుపెడుతున్నట్లు తెలిపారు.

ఇది చదవండి: చిరకాల మిత్రుడితో చిరంజీవి సిక్కిం టూర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.