ETV Bharat / sitara

రెండు రోజుల్లో సినిమా రిలీజ్.. నిర్మాత మృతి

author img

By

Published : May 26, 2021, 9:27 AM IST

krishna kumar
కృష్ణకుమార్

టాలీవుడ్​లో మరో విషాదం చోటు చేసుకుంది. సాయి పల్లవి నటించిన 'అనుకోని అతిథి' తెలుగు వెర్షన్​కు నిర్మాతగా వ్యవహరించిన కృష్ణకుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆహాలో విడుదల కానుంది.

టాలీవుడ్​లో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్ ప్రధానపాత్రల్లో నటించిన 'అనుకోని అతిథి' తెలుగు వెర్షన్​కు నిర్మాతగా వ్యవహరించారు కృష్ణ కుమార్.

మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అథిరన్'​కు తెలుగు రీమేక్ 'అనుకోని అతిథి'. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగులో నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. మే 28న ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా రిలీజ్ కానుంది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుందనగా నిర్మాత చనిపోవడం బాధాకరమని సంతాపం తెలుపుతున్నారు అభిమానులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.