టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్ ప్రధానపాత్రల్లో నటించిన 'అనుకోని అతిథి' తెలుగు వెర్షన్కు నిర్మాతగా వ్యవహరించారు కృష్ణ కుమార్.
మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అథిరన్'కు తెలుగు రీమేక్ 'అనుకోని అతిథి'. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగులో నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. మే 28న ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా రిలీజ్ కానుంది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుందనగా నిర్మాత చనిపోవడం బాధాకరమని సంతాపం తెలుపుతున్నారు అభిమానులు.