ETV Bharat / sitara

ప్రభాస్​కు ఆ నటిపై క్రష్​ ఉందట!

author img

By

Published : Nov 2, 2020, 8:23 AM IST

హీరో ప్రభాస్​కు ​తనపై క్రష్​ ఉందని తెలిపారు బాలీవుడ్​ నటి భాగ్యశ్రీ. రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణలో ఈ విషయాన్ని డార్లింగ్​ తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది.

Prabhas
ప్రభాస్​

తనదైన నటనతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు బాలీవుడ్​ నటి భాగ్యశ్రీ. త్వరలోనే హీరో ప్రభాస్​ నటిస్తోన్న రాధేశ్యామ్​తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనపై క్రష్​ ఉన్నట్లు ప్రభాస్​ చెప్పాడని వెల్లడించారు.

"రాధేశ్యామ్‌ ఓ మంచి కథ. మీరు ఆ సినిమా చూస్తే గానీ దాని అనుభూతి తెలియదు. చిత్రబృందం నన్ను చాలా బాగా చూసుకున్నారు. హైదరాబాద్​ మిఠాయిలు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే చిత్రకరణ సమయంలో ఓ సారి ప్రభాస్‌ నా దగ్గరకు వచ్చి నాపై క్రష్ ఉందని​ చెప్పాడు."

-భాగ్య శ్రీ, బాలీవుడ్​ సీనియర్​ నటి.

రాధేశ్యామ్​కు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తుండగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్​గా పూజాహెగ్డే నటిస్తోంది. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

ఇదీ చూడండి పూజ,రాశీ అందాలు.. రష్మిక కసరత్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.