ETV Bharat / sitara

'పుష్ప' సెట్​లో అనసూయ.. థియేటర్లలోనే 'గల్లీరౌడీ'

author img

By

Published : Jul 8, 2021, 4:14 PM IST

MOVIE UPDATES
మూవీ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అల్లు అర్జున్ 'పుష్ప', సందీప్ కిషన్ 'గల్లీరౌడీ', శ్రీసింహా 'దొంగలున్నారు జాగ్రత్త', ఆది-పాయల్ 'కిరాతక' చిత్రాల సంగతులు ఉన్నాయి.

*నటి, వ్యాఖ్యాత అనసూయ.. అల్లుఅర్జున్ 'పుష్ప' షూటింగ్ పాల్గొంది. హైదరాబాద్​లో జరుగుతున్న చిత్రీకరణకు గురువారం నుంచి హాజరైంది. ఈ సినిమాలో ఈమె కీలకపాత్రలో కనిపించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

anasuya
అనసూయ

*'గల్లీబాయ్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్తలపై హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా అని పరోక్షంగా సదరు పుకార్లకు చెక్ పెట్టారు. ఇందులో నేహాశెట్టి హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

sundeepkishan gullyrowdy
గల్లీరౌడీలో సందీప్ కిషన్

*కీరవాణి కుమారుడు సింహా హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. సురేశ్​ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'దొంగలున్నారు జాగ్రత్త' టైటిల్​ నిర్ణయించారు. గురువారం నుంచి హైదరాబాద్​లో షూటింగ్ కూడా మొదలైంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

DONGALUNNARU JAGARTHA movie
శ్రీసింహా 'దొంగలున్నారు జాగ్రత్త' లాంచ్ ఈవెంట్

*ఆది సాయికుమార్, పాయల్ రాజ్​పుత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కిరాతక'. క్రైమ్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్​లుక్స్​ను గురువారం విడుదల చేశారు. రొమాంటిక్​గా, థ్రిల్లింగ్ ఉన్న పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. వీరభద్రం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

aadi saikumar kirathaka movie
ఆది సాయికుమార్- పాయల్ రాజ్​పుత్
aadi saikumar kirathaka movie
ఆదిసాయికుమార్ కిరాతక మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.