ETV Bharat / sitara

ఎట్టకేలకు ఇంటికొస్తున్న మంచు విష్ణు భార్య

author img

By

Published : Jun 11, 2020, 5:04 PM IST

manchu vishnu
విష్ణు

కరోనా లాక్​డౌన్ కారణంగా సింగపుర్​లోనే ఉండిపోయింది మంచు విష్ణు భార్య విరానిక. తాజాగా దేశానికి వస్తున్నానంటూ ట్వీట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ చాలామందిని అనేక ఇబ్బందులకు గురిచేసింది. లాక్‌డౌన్‌ కారణంగా సింగపుర్​లో చిక్కుకుపోయిన తెలుగు కథానాయకుడు మంచు విష్ణు భార్య విరానిక త్వరలోనే ఇండియాకు చేరుకోనుంది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. విరానిక కూడా దేశానికి రాబోతుంది.

"ఎట్టకేలకు 100రోజుల తర్వాత ఇంటికొస్తున్నాం. ఇందుకు కారణమైన ప్రభుత్వాలకు, విమానయాన సంస్థలకు, సింగపుర్ అధికారులకు ధన్యవాదాలు.." అంటూ ఇద్దరు కుమార్తెలతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది విరానిక. కరోనా వైరస్‌ కారణంగా సుమారు 100రోజుల పైగా సింగపుర్‌లోనే ఉండిపోయింది. .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.