ETV Bharat / sitara

సూర్య 'నీట్' ట్వీట్లపై మద్రాస్ హైకోర్టు తీర్పు

author img

By

Published : Sep 18, 2020, 3:53 PM IST

Updated : Sep 18, 2020, 4:02 PM IST

న్యాయవ్యవస్థ పనితీరు గురించి మాట్లాడటం తగదని హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు హితవు పలికింది. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో చేసిన ట్వీట్లపై స్పందిస్తూ ఈ విధంగా తీర్పునిచ్చింది.

Madras HC refuses to pursue contempt proceedings against actor Suriya
హీరో సూర్య

తమిళ హీరో సూర్యపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోమని మద్రాస్ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నీట్​ పరీక్షల భయంతో తమిళనాడుకు చెందిన నలుగురు విద్యార్థులు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య, న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు.

సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, అతడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం చీఫ్ జస్టిస్​కు లేఖ రాశారు. జడ్జిల నైతికతపై ఈ నటుడు ట్వీట్లు చేశారని పేర్కొన్నారు. ఈ విషయమై స్పందించిన న్యాయస్థానం.. సూర్య వ్యాఖ్యలు అనవసరం, సమర్థనీయం కానివని తెలిపింది. తమ పనితీరు గురించి మాట్లాడటం తగదని స్పష్టం చేసింది.

Last Updated :Sep 18, 2020, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.