ETV Bharat / sitara

తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తమిళంలో శర్వానంద్!

author img

By

Published : Mar 22, 2020, 9:47 PM IST

యువహీరో శర్వానంద్​.. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత తమిళంలో నటించనున్నాడట. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్​ రాజుసుందరం దర్శకత్వం వహించనున్నాడు.

తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తమిళంలో శర్వానంద్!
హీరో శర్వానంద్

విభిన్న పాత్రలు చేసే తెలుగు హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఇటీవలే 'జాను' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమాలో రైతుగా నటిస్తున్నాడు. దీని షూటింగ్​ కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయింది. అయితే ఇతడి కొత్త ప్రాజెక్ట్​కు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది.

శర్వానంద్ గతంలో తమిళంలో 'ఎంగేయుమ్ ఎప్పోతమ్'(తెలుగులో 'జర్నీ')లో హీరోగా నటించాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత అక్కడ ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కొరియోగ్రాఫర్​ రాజు సుందరం దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్​ త్వరలోనే ఖరారు కానుంది. కరోనా ప్రభావం తగ్గాక, మే నెలాఖరు నుంచి షూటింగ్​ ప్రారంభమవొచ్చని టాక్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.