ఈ జంట చిందేస్తే.. సినిమా సూపర్ హిట్!

author img

By

Published : Nov 4, 2020, 6:01 PM IST

Best onscreen couples of Tollywood ever

సినిమాల్లో కొన్ని జంటల్ని చూస్తే మచ్చటేస్తుంది. తమ అందం, అభినయం, కెమిస్టీలతో అభిమానుల్ని మాయ చేస్తారు, ఆకట్టుకుంటారు, వారి మదిలో స్థానం సంపాదిస్తారు. అలా మెప్పించి ఎవర్​గ్రీన్​గా నిలిచిపోయిన కొన్ని జోడీల గురించే ఈ ప్రత్యేక కథనం.

ఏడు దశాబ్దాల టాలీవుడ్ చరిత్ర​లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. అందులో ఎన్నో జోడీలు.. సినీ ప్రేమికుల మదిలో చిరకాలం నిలిచిపోయాయి. అందులో ప్రధానంగా చిరంజీవి-శ్రీదేవి, చిరంజీవి-విజయశాంతి, నాగార్జున-టబు, వెంకటేశ్​-సిమ్రాన్​ జంటలు తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించాయి. మంచి కెమిస్ట్రీతో సినిమాలోని సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాలను పలికించారు. చూసే వీక్షకులకు వారు నిజంగానే ప్రేమలో పడ్డారా? అనే సందేహం​ వచ్చేంతలా ఆ పాత్రల్లో లీనమైపోయారు. అలాంటి కొన్ని జోడీల గురించే ఈ కథనం.

చిరంజీవి-శ్రీదేవి

Best onscreen couples of Tollywood ever
చిరంజీవి-శ్రీదేవి

మెగాస్టార్​ చిరంజీవి, అందాల తార శ్రీదేవి తొలిసారి కలిసి నటించిన చిత్రం 'రాణికాసుల రంగమ్మ'. 1981లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో 'ఎస్​పీ పరశురామ్​', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' లాంటి చిత్రాల్లో కలిసి నటించారు. అద్భుతంగా కెమిస్ట్రీ పండించారు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రంలో చిరంజీవి, శ్రీదేవిల పాత్రలను ఇప్పటికీ మర్చిపోలేరంటేనే మీరు అర్ధం చేసుకోవచ్చు.

నాగార్జున - టబు

Best onscreen couples of Tollywood ever
నాగార్జున - టబు

నాగార్జున, టబు కలిసి నటించిన చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 1996లో వచ్చిన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకోవడం సహా నాగార్జున కెరీర్​లో క్లాసికల్ హిట్​గా నిలిచింది. ఈ సినిమాలో నాగ్​, టబు మధ్య జరిగే రొమాంటిక్​ సన్నివేశాలు వీక్షకుల్ని కట్టిపడేశాయి. ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డు, ఫిలింఫేర్​ అవార్డులను 'నిన్నే పెళ్లాడతా' దక్కించుకుంది.

వెంకటేశ్​ - సిమ్రాన్​

Best onscreen couples of Tollywood ever
వెంకటేశ్​ - సిమ్రాన్​

విక్టరీ వెంకటేశ్​, సిమ్రాన్​ల జోడీని తెలుగు చిత్రపరిశ్రమలో అందమైన జోడీ అని అంటారు. 'కలిసుందాం రా'లో వీరిద్దరూ చేసిన అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీళ్ల మధ్య రొమాంటిక్​ సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఉదయ్​ శంకర్​ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. దీనిని 'కుచ్​ తుమ్​ కహో కుచ్​ హమ్​ కహీన్​'గా హిందీలోనూ రీమేక్​ చేశారు.

మహేశ్​బాబు - త్రిష

మహేశ్​ బాబు, త్రిష జోడీగా నటించిన చిత్రం 'అతడు'. ఇది రొమాంటిక్​ సినిమా కానప్పటికీ హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో ప్రేమ అద్భుతంగా పండించారు. త్రిషను మహేశ్​ టీజ్ చేసే సన్నివేశాలు.. ఇద్దరూ అసలైన బావమరదళ్లు ఏమో అనిపించాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'అతడు'.. 2005లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉత్తమ చిత్రంగా సంతోషం ఫిల్మ్​ అవార్డు గెలుచుకోవడం సహా మహేశ్​కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది.

.
.

ప్రభాస్​ - అనుష్క

టాలీవుడ్​ అందమైన జోడీల్లో ప్రభాస్​ - అనుష్క అగ్రస్థానంలో ఉంటారు. వీరిద్దరి కలిసి మొదటిసారిగా 'బిల్లా'లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'మిర్చి', 'బాహుబలి' సిరీస్ చిత్రాలతో ప్రేక్షకులను మరింతగా కట్టిపడేశారు. బహుశా సినిమాల్లో వారిద్దరి మధ్య కుదిరిన మంచి కెమిస్ట్రీ కారణంగా నిజజీవితంలో వారిపై రుమర్లు కూడా లెక్కలేనన్ని వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.