ETV Bharat / sitara

Allu Arjun: ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు!

author img

By

Published : Aug 9, 2021, 7:37 PM IST

మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'శాకుంతలం'(Shaakuntalam). కథానాయకుడు అల్లుఅర్జున్(Allu Arjun)​ కుమార్తె అర్హ ఇందులో భరతుడిగా కనిపించనుంది. ప్రస్తుతం తను ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంది. అదే లొకేషన్‌లో అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అలా సెట్‌లో అర్హను(Allu Arha) కలిసిన అర్జున్‌ తన మనసులో మాటను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు.

Allu Arjun emotional tweet about his daughter Arha
Allu Arjun: ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు!

"నటీనటులుగా మేం సెట్‌లో కలుసుకునేందుకు మరో 15-20 ఏళ్లు పడుతుందనుకున్నాను. కానీ ఈరోజే ఆ పరిస్థితి ఎదురైంది" అని తన ముద్దుల కూతురు అర్హని ఉద్దేశించి ట్వీట్‌ చేస్తూ తండ్రిగా ఉప్పొంగిపోయారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun). 'శాకుంతలం'(Shaakuntalam) చిత్రంతో అర్హ వెండి తెరకు పరిచయమవుతోంది. సమంత(Samantha Akkineni) ప్రధాన పాత్రలో గుణశేఖర్‌(Gunasekhar) తెరకెక్కిస్తున్న చిత్రమిది.

  • Today my daughter Arha and I are shooting for different films at the same location. So, got to visit her set. I was expecting something like this to happen maybe after 15-20 years. But it happened so soon. PUSHPA meets BHARATA in SHAAKUNTHALAM. What a memorable coincidence 💖 pic.twitter.com/4J3mMZmmBj

    — Allu Arjun (@alluarjun) August 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈరోజు నేను, నా కూతురు అర్హ ఒకే లొకేషన్లో రెండు వేర్వేరు చిత్రాల షూటింగ్​లో పాల్గొన్నాం. అందుకని ఆమె షూటింగ్​ సెట్​కు వెళ్లాను. అయితే నటీనటులుగా మేం సెట్​లో కలుసుకునేందుకు మరో 15-20 ఏళ్లు పడుతుందని అనుకున్నాను. కానీ, అది ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. పుష్ప మీట్స్‌ భరత ఇన్‌ శాకుంతలం. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం ఇది".

- అల్లుఅర్జున్​, కథానాయకుడు

'పుష్ప', 'శాకుంతలం' చిత్రాలూ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. అల్లు అర్జున్​ హీరోగా నటిస్తున్న 'పుష్ప' ఈ క్రిస్మస్‌కు విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతం ఆగస్టు 13న విడుదలవుతుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. 'శాకుంతలం' చిత్రీకరణ ఇటీవల పునః ప్రారంభమైంది. మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి.. మహేష్​- త్రివిక్రమ్‌ మూవీ.. అప్డేట్​ వచ్చేసింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.