ETV Bharat / sitara

మౌనం వీడాలి.. జాత్యాహంకారానికి ముగింపు పలకాలి

author img

By

Published : Jun 6, 2020, 2:18 PM IST

ఆఫ్రికన్-అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​పై పోలీసుల వికృత చర్యను ఖండించారు పలువురు హీరోయిన్లు. తమన్నా, ప్రియాంకా చోప్రా సహా పలువురు కథానాయికలు ఫ్లాయిడ్ మృతి నేపథ్యంలో జరుగుతోన్న నిరసనలకు మద్దతు తెలిపారు.

tamanna
తమన్నా

ఆఫ్రికన్-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని ప్రజలంతా రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలోనే వారి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చారు.

ఓ నల్లని అర చేయి నోటిని నొక్కుతున్నట్లుగా ఉన్న ఓ చిత్రాన్ని ట్విట్టర్​‌లో పోస్ట్​ చేసింది తమన్నా. "ఇది కేవలం నల్ల జాతీయుల జీవితాలకు సంబంధించిందే కాదు.. అందరికి సంబంధించిన అంశం" అంటూ 'ఆల్‌ లైఫ్స్‌ మ్యాటర్‌' పేరుతో ట్వీట్‌ చేసింది. "మీ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు" అని తెలిపింది.

  • Your silence will not protect you. Doesn't every life matter, human or animal? Muting any form of creation is against the universal law. We must unlearn and learn to be human again, express compassion and practice love.#AllLivesMatter #WakeUpWorld pic.twitter.com/Ixzq39ueJC

    — Tamannaah Bhatia (@tamannaahspeaks) June 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అమెరికా సహా ప్రపంచంలో జరిగే ఈ జాత్యహంకార దుశ్చర్యలకు ముగింపు పలకాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. దీనికోసం మనం చాలా చేయాలి. మనల్ని మనం విద్యావంతులుగా రూపుదిద్దుకోవాలి. కేవలం చర్మ రంగు కారణంగా వేరొకరి చేతిలో ఎందుకు బలైపోవాలి?"

-ప్రియాంకా చోప్రా, బాలీవుడ్​ హీరోయిన్​.

'ఆల్​ కలర్స్​ ఆర్​ బ్యూటిఫుల్'​ అంటూ ట్విట్టర్​ ద్వారా వినూత్నంగా ఓ ఫొటోను పోస్ట్​ చేసింది బాలీవుడ్​ భామ దిశా పటానీ. ఆ ఫొటోలో అన్ని రంగుల చేతులు కలగలిపి ఉన్నాయి.

ఇదీ చూడండి : బాలీవుడ్​ హీరోలతో 'బాహుబలి' ఢీ- దక్షిణాదిలో టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.