ETV Bharat / sitara

గ్రీన్​ ఛాలెంజ్​: కుమారుడితో కలిసి మొక్కలు నాటిన ప్రకాశ్​రాజ్​

author img

By

Published : Oct 1, 2020, 12:02 PM IST

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ ప్రముఖుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు.

గ్రీన్​ ఛాలెంజ్​: కుమారుడితో కలిసి మొక్కలు నాటిన ప్రకాశ్​రాజ్​
గ్రీన్​ ఛాలెంజ్​: కుమారుడితో కలిసి మొక్కలు నాటిన ప్రకాశ్​రాజ్​

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాశ్​రాజ్​ మొక్కలు నాటారు. నటుడు తనికెళ్ల భరణి నుంచి ఛాలెంజ్​ స్వీకరించిన ఆయన షాద్​నగర్​లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ హరితహారం ప్రారంభించి... ఆరేళ్లలో రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చారని ప్రకాశ్​రాజ్​ అన్నారు. సీఎం కేసీఆర్​, రాజ్యసభ సభ్యుడు సంతోష్... మట్టి మనుషులని ప్రశంసించారు. మట్టి విలువ తెలిసిన వారు కాబట్టే మట్టికి.. చెట్టుకు ఉన్న అనుబంధంతో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా నటుడు మోహన్ లాల్, సూర్య , కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష ఛాలెంజ్​ స్వీకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు స్వతహాగా మొక్కలు నాటాలని సూచించారు.

ఇదీ చూడండి: గ్రీన్ ఛాలెంజ్ : కూతురితో కలిసి మొక్కలు నాటిన మంచు లక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.