దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం32ను త్వరలోనే భారత్లో విడుదల చేయనుంది. ఈ మేరకు శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ప్రత్యక్షమైన ప్రత్యేక పేజీ ఒకటి ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నట్లు టెక్ నిపుణులు వెల్లడించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 ఫీచర్స్..
- హీలియో జీ80 చిప్సెట్
- 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- 6 జీబీ ర్యామ్
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- 20 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా
- 64ఎంపీ రేర్ కెమెరా
- 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే
- 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చే ఈ ఫోన్.. బ్లాక్, వైట్, లేత నీలం రంగుల్లో లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చినందున.. భారత్లో విడుదలకు సంబంధించి జూన్ ప్రారంభంలో శాంసంగ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: క్యూ1లో శాంసంగ్కు భారీ లాభాలు