చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్ను విడుదల చేసింది. ఒప్పో ఎఫ్19ఎస్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెండు రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటితో పాటు ఫోన్ ప్రధాన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేద్దాం.
ఫీచర్లు..
- డిస్ప్లే సైజ్ 16.34 సెం.మీ
- 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ట్రిపుల్ రేర్ కెమెరా(48ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
- సెల్ఫీ కెమెరా-16 ఎంపీ
- 6జీబీ ర్యామ్, 128 జీబీ మెమొరీ
- క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662
- కలర్ ఓఎస్ 11.1
- ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- గోల్డ్, నలుపు రంగుల్లో అందుబాటులోకి రానుంది ఒప్పొ ఎఫ్19ఎస్
- ధర- రూ. 19,990
ఇదీ చూడండి: షియోమీ నుంచి కొత్తఫోన్- 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్!