ETV Bharat / jagte-raho

పశువుల మేతకి వెళ్లి విద్యుదాఘాతంతో  మహిళ మృతి

author img

By

Published : Dec 12, 2020, 10:14 AM IST

పశువులను మేతకి తీసుకెళ్లిన ఓ మహిళ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. కరెంట్ తీగలు చెట్లకు తగిలి ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

woman died with electric shock in bhadradri kothagudem district
పశువులను మేతకి తీసుకెళ్లిన మహిళ... విద్యుదాఘాతంతో మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం బాటన్న నగర్​లో విషాదం చోటు చేసుకుంది. పశువులను మేతకి తీసుకెళ్లిన మాడే ఎర్రమ్మ అనే మహిళ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

హైటెన్షన్ తీగలు చెట్లకు తగిలి ఉండడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. రోజూలాగే పశువులను మేతకి తీసుకెళ్లిన మహిళ ఆకస్మిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.