ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో భార్య హత్య.. అనాథలుగా పిల్లలు

author img

By

Published : Aug 9, 2020, 11:33 PM IST

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంసాగర్​లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో... భార్యను గొంతు నులిమి భర్త హత్య చేశాడు. దీంతో వారి పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు.

wife murdered with family disputes in ramsagar
కుటుంబ కలహాలతో భార్య హత్య.. అనాథలుగా పిల్లలు

భార్య, భర్తల మధ్య గొడవ ఆ పసిపిల్లలకు తల్లి ప్రేమను దూరం చేసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన స్వామి, యాదమ్మ దంపతుల మధ్య తరచూ గొడవ జరిగేది. ఆదివారం రాత్రి జరిగిన తగదాలో ఆవేశానికి గురైన స్వామి... తన భార్య యాదమ్మ గొంతు నులిమి చంపాడు. దీంతో ఇద్దరు చిన్నారులు తల్లి లేనివారయ్యారు. ప్రస్తుతం స్వామి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుని కోసం గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.