ETV Bharat / jagte-raho

వాగులో ఇద్దరు గల్లంతు...లభ్యంకాని ఆచూకీ

author img

By

Published : Nov 23, 2020, 2:00 AM IST

వాగులో ఇద్దరు గల్లంతైన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం పింజరకొండ వద్ద చోటుచేసుకుంది. రాత్రి వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో తొమ్మిదేళ్ల పాపతో పాటు ఓ యువకుడు ఉన్నాడు.

Breaking News

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం పింజరకొండ వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవి తెలిపిన వివరాలను వెల్లడించారు. జడ్డంగి పోలీసు స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వాసంశెట్టి సింహాద్రి అప్పలరాజు, రాజమహేంద్రవరం వన్​టౌన్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న బాపనమ్మ దంపతులు. వీరివురూ తమ ఇద్దరు పిల్లలతో సరదాగా గడిపేందుకు ఆదివారం పింజరకొండ వద్దకు వచ్చారు.

సమీపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దంపతులిద్దరూ వెళ్లారు. వాగు ఒడ్డున ఉన్న పిల్లలిద్దరిలో తొమ్మిదేళ్ల మౌనసాయిశ్రీ వాగులోకి దిగింది. వాగు ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా వారివెంట డ్రైవర్​గా వచ్చిన మహేశ్ అనే వ్యక్తి కాపాడేందుకు వాగులో దూకాడు. ప్రవాహ ఉద్ధృతితో ఇద్దరూ గల్లంతయ్యారు. రాత్రి వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. సోమవారం కూడా గాలింపు చర్యలు చేపడతామని ఏఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి:కల్యాణలక్ష్మి అవినీతిలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.