ETV Bharat / jagte-raho

హోర్డింగ్​ను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి

author img

By

Published : Nov 8, 2020, 12:25 PM IST

అతివేగం ప్రమాదకరమని ఎంత చెప్పినా యువకులు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా భారీ మూల్యంగా జీవితాలనే చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్​ కార్ఖానాలో అర్ధరాత్రి వేళ అతివేగంతో వచ్చిన ఓ కారు హోర్డింగుకు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

two died and two severally injured in car accident at karkhana
two died and two severally injured in car accident at karkhana

హైదరాబాద్​లోని కార్ఖాన పోలీస్​స్టేషన్​ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన ఓ కారు ప్రకటనల హోర్డింగ్​కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జూబ్లీహిల్స్ నుంచి నేరేడ్​మెట్​ వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి ప్రకటనల హోర్డింగ్​కు ఢీకొంది. ఈ ఘటనలో కారు తుక్కుతుక్కైంది. ప్రమాదానికి గురైన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉండగా... తీవ్రంగా గాయపడ్డారు.

హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... నేరేడ్​మెట్​కు చెందిన సాయికిరణ్​రెడ్డి, సోహెల్ ఇద్దరు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరిని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయికిరణ్ రెడ్డి, సోహెల్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా... ఏఎస్​రావు నగర్ నేరేడ్​మెట్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీ కార్మికురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.