హైదరాబాద్లోని కార్ఖాన పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన ఓ కారు ప్రకటనల హోర్డింగ్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జూబ్లీహిల్స్ నుంచి నేరేడ్మెట్ వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి ప్రకటనల హోర్డింగ్కు ఢీకొంది. ఈ ఘటనలో కారు తుక్కుతుక్కైంది. ప్రమాదానికి గురైన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉండగా... తీవ్రంగా గాయపడ్డారు.
హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... నేరేడ్మెట్కు చెందిన సాయికిరణ్రెడ్డి, సోహెల్ ఇద్దరు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరిని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయికిరణ్ రెడ్డి, సోహెల్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా... ఏఎస్రావు నగర్ నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.