ETV Bharat / jagte-raho

వివాహేతర సంబంధం.. ఇద్దరు ఆత్మహత్య

author img

By

Published : Jan 6, 2021, 11:57 AM IST

Updated : Jan 6, 2021, 5:09 PM IST

వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ఆత్మహత్య
వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ఆత్మహత్య

11:54 January 06

వివాహేతర సంబంధం.. ఇద్దరు ఆత్మహత్య

భర్త, ఇద్దరు పిల్లలను కాదని మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమె మొజులో పడి ఆ వివాహితతో పాటు ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్​ జిల్లా దేవరంపల్లి వద్ద చోటు చేసుకుంది. జిల్లాలోని కోట్​పల్లి మండలం నాసన్​పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లావణ్యలకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు.

ఈ మధ్యకాలంలో లావణ్య.. పిల్లలిద్దరినీ అదే గ్రామానికి చెందిన శ్రీశైలం వద్దకు కరాటే క్లాసుకు తీసుకెళ్లేది. ఈ తరుణంలోనే లావణ్య, శ్రీశైలం మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త, ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి లావణ్య.. రెండు రోజుల క్రితం శ్రీశైలంతో కలిసి వెళ్లి మైలార్ దేవరంపల్లి శివారులోని లైఫ్ యూనివర్సిటీ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చూడండి: భార్యను చంపి.. దేహాన్ని మూట కట్టి.. పరారీ

Last Updated :Jan 6, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.