ETV Bharat / jagte-raho

రైతు ఇంట్లో చోరీ.. బంగారం, వెండి అపహరణ

author img

By

Published : Sep 5, 2020, 2:08 PM IST

Theft in a farmer's house .. Gold and silver theft
రైతు ఇంట్లో చోరీ.. బంగారం, వెండి అపహరణ

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురులోని ఓ రైతు ఇంట్లో దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దుండగులు పలు బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని నల్ల మల్లయ్య అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు.. సుమారు 5 తులాల బంగారం, 70 తులాల వెండి అపహరించుకుపోయారు.

గ్రామానికి చెందిన నల్ల మల్లయ్య శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి నార్కట్​పల్లి మండలం కక్కిరేని గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులోని సుమారు 5 తులాల బంగారం, 70 తులాల వెండిని దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. క్లూస్​ టీంతో ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్​కిరణ్ తెలిపారు.

Theft in a farmer's house .. Gold and silver theft
రైతు ఇంట్లో చోరీ.. బంగారం, వెండి అపహరణ

ఇదీచూడండి.. గుట్కా స్థావరాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.