ETV Bharat / jagte-raho

డబ్బు కోసం తల్లినే చంపేసిన కూతురు

author img

By

Published : Dec 13, 2020, 9:53 PM IST

the-daughter-killed-the-mother-for-money-in-kamareddy-district
డబ్బు కోసం తల్లినే చంపేసిన కూతురు

ఓ తల్లి తన కూతురు దగ్గరే అప్పు చేసింది. కానీ అప్పు తీర్చలేకపోయింది. కూతురు ఆ డబ్బు కావాలని అడిగింది. తల్లి తన దగ్గర డబ్బు లేదని.. కట్టలేనని చెప్పింది. మాటామాటా పెరిగింది. కూతురు ఆవేశంతో రగిలిపోయింది. బండరాయితో మోది తన తల్లిని చంపేసింది. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. డబ్బుల కోసం తల్లిని కుమార్తె హత్య చేసింది. బిచ్కుంద మండలం దౌల్తాపూర్ గ్రామంలో తల్లిని కూతురు హత్య చేసినట్లు సీఐ సాజిద్ తెలిపారు. గతంలో ఇచ్చిన అప్పు తీర్చాలంటూ తల్లి, కూతురు గొడవ పడినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. మాటామాటా పెరిగి బండరాయితో మోది తల్లిని చంపినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.