ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్ లారీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Dec 7, 2020, 4:07 PM IST

road-accident-in-vijayawada-krishna-district
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్ లారీ.. ఇద్దరు మృతి

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అగ్నికి ఆహుతై మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో మరణించారు. మరొకరి పరిస్థితి విషమించింది. మృతులు కృష్ణలంక రణధీర్ నగర్​కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం ఏపీలోని విజయవాడ కృష్ణలంక పరిధిలో చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ కృష్ణలంక బస్టాండ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణలంక రణధీర్ నగర్​కు చెందిన వారిగా గుర్తించారు.

టిప్పర్ లారీ ఢీ కొట్టిన వెంటనే ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అగ్నికి ఆహుతై మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో మరణించారు. మృతులు వినోద్, శేఖర్​లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అధికార పార్టీ నేతల కబ్జాలో ప్రభుత్వ భూమి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.