ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కృష్ణలంక బస్టాండ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణలంక రణధీర్ నగర్కు చెందిన వారిగా గుర్తించారు.
టిప్పర్ లారీ ఢీ కొట్టిన వెంటనే ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అగ్నికి ఆహుతై మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో మరణించారు. మృతులు వినోద్, శేఖర్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అధికార పార్టీ నేతల కబ్జాలో ప్రభుత్వ భూమి!