ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

author img

By

Published : Dec 7, 2020, 8:17 AM IST

ఏపీలోని కృష్ణాజిల్లాలో ప్రమాదం జరిగింది. బొమ్ములూరు వద్ద ఆగి ఉన్న లారీని.. కారు ఢీ కొట్టంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.

road accident at krishna district
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.. మరో నలుగురికి గాయాలయ్యాయి.

జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 గంటలకు ఘటన జరిగింది. గాయాలైన నలుగురిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భీమవరంలో వివాహ కార్యక్రమానికి హాజరై, తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. కారులో చిక్కుకున్న మృతులను క్రేన్ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మృతుల్లో ఒకరు విజయవాడ వాసిగా.. మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగొండపల్లికి చెందిన దంపతులుగా గుర్తించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఇవీచూడండి: ఇద్దరు మృతి.. యువకుల బ్యాగులో గంజాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.