జగిత్యాల జిల్లా ధరూర్ కరీంనగర్- జగిత్యాల రహదారిపై ఆదివారం అర్ధరాత్రి అతి వేగంగా వెళ్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దానితో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు పక్కనే ఉన్న చికెన్ సెంటర్లోకి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని బిహార్ వాసులుగా గుర్తించారు.
ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కారుతో సహా అక్కడి నుంచి పారిపోగా నెంబర్ను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష