ETV Bharat / jagte-raho

పుట్టినరోజుకు వెళ్లి వస్తుండగా... లారీ ఢీకొని కారులోని ఐదుగురు మృతి

author img

By

Published : Sep 2, 2020, 5:23 AM IST

Updated : Sep 2, 2020, 4:52 PM IST

పసరగొండ వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పెసరగొండ వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

05:19 September 02

పుట్టినరోజుకు వెళ్లి వస్తుండగా... లారీ ఢీకొని కారులోని ఐదుగురు మృతి

పెసరగొండ వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

వరంగల్ గ్రామీణ జిల్లా దామర మండలం పెసరకొండ క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మ మైదాన్​కు చెందిన ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వస్తున్న లారీ, కారును వేగంగా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది.  

కాళేశ్వరం నుంచి వరంగల్ వైపుగా వస్తున్న ఇసుక లారీ వరంగల్ నుంచి పరకాల వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. వరంగల్​లో పుట్టిన రోజు వేడుకలకు హాజరై... పరకాల వెళుతుండగా ఈ  ఘటన  చోటు చేసుకుంది. మృతుల్లో మేడి పవన్ కుమార్, మేకల రాకేష్, మేడి చందు, రోహిత్, సాబీర్​గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.

Last Updated :Sep 2, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.