ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తలమంచిపట్నంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి వైపు నుంచి జమ్మలమడుగు వెళ్తున్న వాహనంలో 986 జిలెటిన్ స్టిక్స్ , 400 డిటోనేటర్లను గుర్తించారు.
ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ మంజునాథ్ రెడ్డి చెప్పారు. నిందితులిద్దరూ జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామానికి చెందిన వారని తెలిపారు.
ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య