మహబూబాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు అంతర్జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 3 లక్షల విలువ చేసే 60 కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా జల్లిపల్లికి చెందిన ప్రసన్నకుమార్, ప్రసాద్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి... మరిపెడ, కురవి మండలాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ ఈ ముఠా లాభాలు గడిస్తోందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. గంజాయి పండించినా, అక్రమ రవాణాకి పాల్పడినా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: అన్న అంత్యక్రియలకు వెళ్లిన తమ్ముడి మృతి