ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో లొల్లి.. సర్దిచేప్పేందుకు వెళ్లిన వ్యక్తి హత్య

author img

By

Published : Oct 20, 2020, 5:42 PM IST

నిజామాబాద్​ జిల్లా గూపన్​పల్లి కమాన్​ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం విషయంలో అన్వర్​, గణేష్​ అనే ఇద్దరి మధ్య వివాదం జరుగుతోంది. సర్దిచెప్పేందుకు వెళ్లిన సయ్యద్​ యూసుఫ్ తలపై సీసాతో కొట్టగా అతను అక్కడికక్కడే చనిపోయాడు.

man murder at nizamabad district
గూపన్​పల్లి కమాన్​ వద్ద వ్యక్తి హత్య.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నిజమాబాద్​ జిల్లా గూపన్​పల్లిలో సోమవారం అన్వర్, సయ్యద్ యూసుఫ్ కలిసి మద్యం సేవిస్తుండగా మద్యం మత్తులో గణేష్ అనే వ్యక్తి వచ్చి తనకు మందు పోయమని గొడవ చేశాడని పోలీసులు తెలిపారు.

మంగళవారం ఉదయం మళ్లీ గణేష్,​ అన్వర్ మద్యం కోసం గొడవ పడుతుండగా సయ్యద్​ యూసుఫ్​ సర్ది చెప్పేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సయ్యద్​ తలపై గణేష్​ బలంగా కొట్టగా అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిః హైదరాబాద్​లో కొనసాగుతోన్న వరుణుడి ప్రతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.